బిగ్‌బాస్ షో’పై మరోసారి సంచలన వాఖ్యలు చేసిన పునర్నవి.. వాళ్లకు కావాల్సిందే..

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 1:51 PM

'బిగ్‌బాస్ షోపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది పునర్నవి భూపాళం. 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో పరిచయం అయిన ఈమె.. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేస్తూ చేసింది. అనంతరం బిగ్‌బాస్ సీజన్‌ 3లో కనిపించింది. ఇక ఆ షోలో అందాల ఆరబోతతో పాటు రాహుల్‌తో రొమాన్స్ పండించి కాంట్రవర్షియల్‌‌గా..

బిగ్‌బాస్ షోపై మరోసారి సంచలన వాఖ్యలు చేసిన పునర్నవి.. వాళ్లకు కావాల్సిందే..
Follow us on

‘బిగ్‌బాస్ షోపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది పునర్నవి భూపాళం. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో పరిచయం అయిన ఈమె.. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేస్తూ చేసింది. అనంతరం బిగ్‌బాస్ సీజన్‌ 3లో కనిపించింది. ఇక ఆ షోలో అందాల ఆరబోతతో పాటు రాహుల్‌తో రొమాన్స్ పండించి కాంట్రవర్షియల్‌‌గా నిలిచింది. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా రాని పాపులారిటీ ఒక్క బిగ్‌బాస్ షోతో వచ్చేసింది. ఈ షో తర్వాత అమ్మడు మంచి స్పీడ్ పెంచింది. ఈ మధ్యే ‘ఒక చిన్న విరామం’ సినిమాలో నటించింది పున్ను. కానీ ఇది కూడా ఆమెకు మంచి విజయం సాధించి పెట్టలేదు. ఇక ఎప్పటిలాగే హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన పున్నూ.. బిగ్ బాస్‌ షో గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో లోపల ఎంతో జరుగుతుందని.. కానీ షో నిర్వాహకులు మాత్రం.. ఎడిట్ చేసి వాళ్లకు అవసరమైన దాన్నే బయటకు చూపిస్తారని చెప్పింది. ప్రేక్షకులు కూడా వాళ్లు చూపించేదే నిజమనే భ్రమలో ఉంటారని చెప్పుకొచ్చింది. అలాగే షోలో ఎలాగున్నా.. బయటకొచ్చిన తర్వాత మాత్రం తనతో హౌస్‌లో ఉన్న అందరితోనూ టచ్‌లో ఉన్నట్టు తెలిపింది పునర్నవి.

కాగా ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ కానుంది. కరోనా కారణంగా ఇంకా ఈ షో మొదలు కాలేదు కానీ.. ఈ షోకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నట్లు సమాచారం. అలాగే బిగ్‌బాస్ సీజన్ 4కి యంగ్ హీరో విజయ దేవరకొండ లేదా అక్కినేని వారి కోడలు సమంత గానీ హోస్ట్‌గా ఉండబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి సీజన్‌ 4లో ఎవరు ఉంటారు? ఎవరు బిగ్‌బాస్ సీజన్ 4 నిర్వహించబోతున్నారో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకూ వేచి చూడాల్సిందే.