Actor Sunil About Farmers: టాలీవుడ్ లో కమెడియన్ గా అడుగు పెట్టి.. హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. తాజాగా ‘జై సేన’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నేపధ్యం గురించి సునీల్ మాట్లాడుతూ.. ” ఒక రైతుకు మన అవసరం లేకున్నా మనందరికీ రైతు అవసరం ఉంది. అందుకని వారి సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. తాను జై సేన లో పవర్ఫుల్ ఐపీయస్ పాత్రలో నటించినట్లు చెప్పారు. ఈ సినిమా ద్వారా రైతు సమస్యలను పదిమందికీ చెబుతూ వారికి పరిష్కారాన్ని చూపించటం మంచి విషయమని చెప్పారు. తాను ఈ సినిమాలో ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు సునీల్.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగే విధంగా ఓ పరిష్కారాన్ని సినిమాలో చర్చించామని చెప్పారు. రైతుల సమస్యలు.. వాటి పరిష్కారం గురించి తీసిన సినిమా కనుక రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు.
జైసేన సినిమాలో శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీశ్ గౌతమ్ హీరోలుగా నటిస్తున్నారు. వి. సముద్ర దర్శకత్వం వహించారు. వి. విజయలక్ష్మీ, వి. సాయి అరుణ్కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
Also Read: ఐదు నందులు అందుకున్న నవ్వుల రేడు ఎంఎస్ నారాయణ వర్ధంతి నేడు