Pawan Kalyan: ‘విజయవాడలో ముంబయి’.. పవన్‌ కోసం మేకర్స్‌ కీలక నిర్ణయం.

|

Aug 27, 2024 | 9:24 AM

పవన్‌ మళ్లీ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్లనున్నారన్న దానిపై చర్చ మొదలైంది. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు చిత్రాలను కచ్చితంగా పూర్తి చేస్తానని పవన్‌ ఇప్పడకే హామీ ఇచ్చారు. అయితే తర్వాత కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది...

Pawan Kalyan: విజయవాడలో ముంబయి.. పవన్‌ కోసం మేకర్స్‌ కీలక నిర్ణయం.
Pawan Kalyan
Follow us on

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పలు శాఖల మంత్రిగా తనదైన మార్క్‌ వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదంతా బాగున్నా.. అభిమానులకు మాత్రం ఏదో ఆందోళన. తమ అభిమాన హీరో డిప్యూటీ సీఎం అయ్యారన్న సంతోషం ఓవైపు ఉన్నా.. సినిమాల మాటేంటి అంటు చర్చించుకుంటున్నారు.

పవన్‌ మళ్లీ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్లనున్నారన్న దానిపై చర్చ మొదలైంది. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు చిత్రాలను కచ్చితంగా పూర్తి చేస్తానని పవన్‌ ఇప్పడకే హామీ ఇచ్చారు. అయితే తర్వాత కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజ సమాచారం ప్రకారం పవన్‌ మళ్లీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుదీప్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ చిత్రాన్ని తొలుత పూర్తి చేయాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తికావడంతో ఈ చిత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని, ఇందుకు పవన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ‘ఓజీ’ చిత్రం ముంబయి నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్‌ కథాంశతో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కథ పరంగా ఈ సినిమా విజయవాడ, ముంబయి నగరాల మధ్య ఉండనుంది. దీంతో రెండు నగరాల్లో షూటింగ్‌ జరగాల్సి వస్తుంది.

అయితే పవన్‌ కళ్యాణ్‌కు సౌలభ్యంగా ఉండేందుకు దర్శకుడు సుజిత్‌ విజయవాడలోనే ముంబయికి సంబంధించిన షూటింగ్ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే విజయవాడలో భారీ సెట్‌ను ఏర్పాటు నిర్మించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. విజయవాడకు సంబంధించిన సన్నివేశాలను అవుట్ డోర్‌లో నిర్వహించి, ముంబయికి సంబంధించిన సన్నివేశాలను సెట్స్‌లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. వారానికి రెండు రోజులు మాత్రమే పవన్ డేట్స్‌ కేటాయించినట్లు సమాచారం. సెప్టెంబర్‌లో ఓజీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది చివరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..