సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు.. జర్నలిస్ట్‌పై కేసు నమోదు

| Edited By:

Apr 20, 2020 | 10:24 PM

జమ్ముకశ్మీర్‌లో ఓ జర్నలిస్ట్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెట్టినందుకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్డించారు.కశ్మీర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కశ్మీర్‌లో ఫ్రీలాన్సర్ ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా అనే 26 ఏళ్ల యువతి.. తన ఫేస్‌బుక్‌లో జాతి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్న తరుణంలో.. మస్రత్ జహ్రా పోస్ట్.. శాంతి భద్రతలను విఘాతం కల్పించేలా ఉండటంతో.. […]

సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు.. జర్నలిస్ట్‌పై కేసు నమోదు
Follow us on

జమ్ముకశ్మీర్‌లో ఓ జర్నలిస్ట్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెట్టినందుకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్డించారు.కశ్మీర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కశ్మీర్‌లో ఫ్రీలాన్సర్ ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా అనే 26 ఏళ్ల యువతి.. తన ఫేస్‌బుక్‌లో జాతి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్న తరుణంలో.. మస్రత్ జహ్రా పోస్ట్.. శాంతి భద్రతలను విఘాతం కల్పించేలా ఉండటంతో.. ఆమెపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

యువతలో జాతి వ్యతిరేకతను రెచ్చగొట్టేలా ఆమె పెట్టిన పోస్ట్ ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమెపై చట్టవ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించే చట్టం కేసు నమోదు చేశామన్నారు. కాగా.. సదరు జర్నలిస్టు.. పలు అంతర్జాతీయ వార్తా సంస్థలకు ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.