AP Crime News: భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్న భర్త.. విషయం తెలిసిన మొదటి ఆవిడ ఏం చేసిందంటే..

|

Feb 17, 2021 | 9:53 AM

AP Crime News: భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో మొదటి భార్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన విజయవాడ యనమలకుదురులోని

AP Crime News: భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్న భర్త.. విషయం తెలిసిన మొదటి ఆవిడ ఏం చేసిందంటే..
Follow us on

AP Crime News: భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో మొదటి భార్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన విజయవాడ యనమలకుదురులోని మార్కెండేయ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మ అనే మహిళ తన భర్త లోకేశ్‌, అత్త వేధింపులతో కొంతకాలంగా తల్లి వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త మరో పెళ్లి చేసుకున్నారని తెలిసి కనకదుర్గమ్మ వారధి పైనుంచి నదిలోకి దూకింది. అదే మార్గంలో వెళుతున్న కొందరు గమనించి తాడేపల్లిలోని వారధి వద్దనున్న ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు తమ సిబ్బందితో వెళ్లి చూడగా 23వ ఖానా వద్ద కృష్ణా నదిలో ఆమె కనిపించింది. అప్పటికే అక్కడున్న యువకులు ఆమెను కాపాడి బయటకు తీశారు. ఇంతలో ఇద్దరు ఏపీఎస్పీ పోలీసులు అక్కడికి చేరుకొని, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మంచంపై ఉంచి అర కిలోమీటరు మేర ఇసుకలో నడుచుకుంటూ మోసుకెళ్లారు. ఆటోలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్  దిగువన చూడండి..