జర్నలిస్టు దారుణ హత్య

|

Mar 03, 2020 | 7:15 AM

ములుగు జిల్లాలో అర్ధరాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పస్రా పట్టణంలో ఫొటో జర్నలిస్టును దారుణంగా హత్య చేశారు దుండగులు. సోమవారం రాత్రి వరంగల్ ప్రెస్‌క్లబ్ కోశాధికారి సునీల్ రెడ్డి అనే వ్యక్తిని దుండుగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. దాడిలో అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి...

జర్నలిస్టు దారుణ హత్య
Follow us on

ములుగు జిల్లాలో అర్ధరాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పస్రా పట్టణంలో ఫొటో జర్నలిస్టును దారుణంగా హత్య చేశారు దుండగులు. సోమవారం రాత్రి వరంగల్ ప్రెస్‌క్లబ్ కోశాధికారి సునీల్ రెడ్డి అనే వ్యక్తిని దుండుగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. దాడిలో అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి…అప్పు వసూలు వెళ్లిన క్రమంలో డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా సునీల్ హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. మ‌ృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు …. దయ అనే వ్యక్తి బేకరీ పెట్టుకోడానికి కృష్ణా రెడ్డి అనే వ్యక్తి దగ్గర రూ. 8 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే తీసుకున్న డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో కృష్ణారెడ్డి తన మిత్రుడైన సునీల్ రెడ్డికి విషయం చెప్పాడు. సునీల్‌తో కలిసి అప్పు వసూలు చేయడానికి పస్రా వెళ్లారు. ఈ సందర్భంగానే బేకరీ యజమాని దయ తన తమ్ముడితో కలసి సునీల్, కృష్ణారెడ్డిలపై కత్తులతో దాడి చేశారు. సునీల్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా…తీవ్రంగా గాయపడ్డ కృష్ణారెడ్డిని చికిత్స కోసం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.