వైజాగ్ దివ్య కేసులో మరో నలుగురు అరెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Jun 12, 2020 | 6:02 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వైజాగ్ దివ్య దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం. మరో నలుగురు నిందితుల అరెస్ట్.

వైజాగ్ దివ్య కేసులో మరో నలుగురు అరెస్ట్
Follow us on

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వైజాగ్ దివ్య దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసు కస్టడీలో ప్రధాన నిందితురాలు వసంతతో పాటు ఆమె చెల్లి గీత అనేక సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను ఫోర్త్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వసంత మరిది సంజయ్యతో పాటు మంజు, ధనలక్ష్మీ, కాంతవేణిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని కోర్టులో హాజరుపర్చగా.. రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇప్పటికే కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు వసంత, గీతలను మరో రోజు పొడిగించింది కోర్టు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీపీ మీనా ఆరుగురు నిందితులను స్వయంగా విచారిస్తూ కీలక విషయాలు రాబడుతున్నారు.