లేచిపోయి పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు.. కట్ చేస్తే..

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 6:20 PM

సాధారణంగా అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్లు కాదని గొడవ చేస్తే లేచిపోయి వివాహం చేసుకుంటూంటారు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్. ఇద్దరమ్మాయిలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇద్దరమ్మాయిలు తమ ఇండ్లలో ఎవరికీ చెప్పకుండా...

లేచిపోయి పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు.. కట్ చేస్తే..
Follow us on

సాధారణంగా అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్లు కాదని గొడవ చేస్తే లేచిపోయి వివాహం చేసుకుంటూంటారు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్. ఇద్దరమ్మాయిలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇద్దరమ్మాయిలు తమ ఇండ్లలో ఎవరికీ చెప్పకుండా లేచిపోయి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరమ్మాయిలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు కజిన్స్ కావడంతో వీరు ఎక్కువగా కలుసుకోవడానికి ఛాన్స్ దొరికింది. ఆ తర్వాత కొన్నాళ్లు సహజీవనం చేశారు.

ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాల్లో ఎవరూ ఒప్పుకోరని తెలుసుకున్న వీరు.. ఎవరికీ చెప్పకుండా గత నెలలో ఇంట్లోనుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈలోగా ఇద్దరమ్మాయిలూ కనిపించకపోవడంతో ఈ నెల 22న వీరి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లేచిపోయిన అమ్మాయిలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో.. పెళ్లికి ప్రేరేపించిన మరో అమ్మాయిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Read More:

బ్రేకింగ్: కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్

బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..