క‌ల్తీ మ‌ద్యంతాగి 12 మంది మృతి !

|

May 04, 2020 | 4:51 PM

క‌ల్తీ మ‌ద్యం సేవించి 12 మంది మ‌త్యువాతప‌డ్డారు. అందరూ కడుపులో నొప్పి, డయేరియా, వాంతులతో

క‌ల్తీ మ‌ద్యంతాగి 12 మంది మృతి  !
Follow us on
క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా మందుబాబులు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. చుక్క మందులేక అల్ల‌డిపోతున్నారు. దీంతో కిక్కెక్కించే ఏదోఒక‌టి దొరికితే చాల‌ని భావించి ఏది ప‌డితే దానిని తాగేస్తూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. భార‌త్‌లోనే కాదు,..అన్ని దేశాల్లో మ‌ద్యం ప్రియుల‌ది ఇదే ప‌రిస్థితి. తాజాగా క‌ల్తీ మ‌ద్యం సేవించి 12 మంది మ‌త్యువాతప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే…

నేపాల్ దేశం ఖాట్మండులో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నేపాల్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృత్యువాత పడ్డారు. మృతులంతా మహోత్తరి జిల్లాలోని వేర్వేరు గ్రామాలకు చెందినవారు. అయితే, వారంతా కల్తీ మద్యం సేవించడంవల్ల ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతుల నుంచి శాంపిల్స్‌ తీసి పరీక్షలకు పంపించామని, ఆ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు వస్తే వారి మరణాలకుగల కారణం ఎమిటో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. చనిపోయిన అందరిలోనూ ఒకే రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించాయని అధికారులు తెలిపారు. అందరూ కడుపులో నొప్పి, డయేరియా, వాంతులతో బాధపడ్డారని చెప్పారు. వారంతా స్థానికంగా తయారయ్యే కల్తీ మద్యం తాగినట్లు అధికారులు గుర్తించారు.