Teacher Arrested: ఝార్ఖండ్‌‌‌‌‌లో దారుణం.. పదమూడేళ్ల బాలికపై టీచర్ అఘాయిత్యం.. ఆపై విషమిచ్చి హత్య..

| Edited By: Rajeev Rayala

Jan 30, 2021 | 11:28 AM

Teacher Arrested: ఝార్ఖాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ పదమూడేళ్ల బాలికపై కన్నేశాడు. ఎవరూ లేని సమయం చూసి అఘాయిత్యానికి

Teacher Arrested: ఝార్ఖండ్‌‌‌‌‌లో దారుణం.. పదమూడేళ్ల బాలికపై టీచర్ అఘాయిత్యం.. ఆపై విషమిచ్చి హత్య..
Follow us on

Teacher Arrested: ఝార్ఖాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ పదమూడేళ్ల బాలికపై కన్నేశాడు. ఎవరూ లేని సమయం చూసి అఘాయిత్యానికి పాల్పడి అనంతరం హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలమౌ జిల్లాలోని పంకికి చెందిన బాలిక జనవరి 26 తేదీన పాఠశాలకు వెళ్లింది. కాగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంభు సింగ్‌ (35) బాలికను ఎవరూలేని తరగతి గదికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ విషయం పోలీసులకు తెలియజేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా అదే రోజు రాత్రి విద్యార్థిని ఇంట్లోకి బలవంతంగా చొరబడి బాలికకు విషపు గోలీలు తినిపించాడు. దీంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తల్లిదండ్రులు తమ కూతురిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

హైదరాబాద్‏లో దారుణం.. ఆడుకోవడానికి వెళ్ళిన నాలుగేళ్ళ చిన్నారిపై 50 ఏళ్ళ వ్యక్తి అఘాయిత్యం..