టీడీపీ నేత దారుణ హత్య.. కర్నూల్‌లో ఉద్రిక్తత

| Edited By:

May 26, 2019 | 6:16 PM

ఎన్నికల కౌంటింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండగా.. ఏపీలో టెన్షన్ వాతావరణం అప్పుడే మొదలైంది. కర్నూల్‌ జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. డోన్ మండలం తాపలకొత్తూరులో శేఖర్ రెడ్డిపై దుండగులు దాడి చేసి, చంపేశారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్ట్‌మార్టం నిమిత్తం శేఖర్ రెడ్డి బాడీని ఆసుపత్రికి తరలించారు. కాగా శేఖర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తికి సన్నిహితుడని తెలుస్తోంది. మరోవైపు శేఖర్ రెడ్డి మరణంతో జిల్లా […]

టీడీపీ నేత దారుణ హత్య.. కర్నూల్‌లో ఉద్రిక్తత
Follow us on

ఎన్నికల కౌంటింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండగా.. ఏపీలో టెన్షన్ వాతావరణం అప్పుడే మొదలైంది. కర్నూల్‌ జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. డోన్ మండలం తాపలకొత్తూరులో శేఖర్ రెడ్డిపై దుండగులు దాడి చేసి, చంపేశారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్ట్‌మార్టం నిమిత్తం శేఖర్ రెడ్డి బాడీని ఆసుపత్రికి తరలించారు. కాగా శేఖర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తికి సన్నిహితుడని తెలుస్తోంది. మరోవైపు శేఖర్ రెడ్డి మరణంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది.