చనిపోయిన తల్లి బతికి రావాలంటూ అభంశుభం తెలియని పిల్లలు ప్రార్థనలు చేశారు. ఒక్క రోజు… రెండు రోజులు కాదు… ఏకంగా 22 రోజులుగా తల్లి మృతదేహం వద్దే ప్రార్థనలు చేస్తూ ఉండిపోయారు. అయితే పోలీసులకు సమాచారం తెలియడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన తమిళనాడు దిండిగల్ జిల్లా నందవనవట్టి కాలనీలో చోటు చేసుకుంది. ఇందిరా అనే మహిళ కానిస్టేబుల్గా పని చేస్తోంది. కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్త నుంచి విడిపోయి… పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో ఇందిరా డిసెంబర్ 7న అనారోగ్యంతో మృతి చెందింది. ప్రార్థనలు చేస్తే ఇందిరా బతుకుతుందని పాస్టర్ సుదర్శన్ చెప్పడంతో పిల్లలు 22 రోజులుగా మృతదేహం వద్దే ప్రార్థనలు చేస్తు ఉండిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో మృతురాలి అక్క వాసుకితో పాటు పాస్టర్ సుదర్శన్ అరెస్ట్ చేశారు.
Also Read:
Doctor Suicide : విజయవాడలో కలకలం.. లేడీ డాక్టర్ ఆత్మహత్య..సూసైడ్ నోట్లో అతడి పేరు