Prayer for Mother : చనిపోయిన తల్లి బతకాలంటూ పిల్లల ప్రార్థనలు… 22 రోజులుగా మృతదేహం వద్దే…

| Edited By:

Jan 02, 2021 | 1:10 AM

చనిపోయిన తల్లి బతికి రావాలంటూ అభంశుభం తెలియని పిల్లలు ప్రార్థనలు చేశారు. ఒక్క రోజు... రెండు రోజులు కాదు... ఏకంగా 22 రోజులుగా తల్లి మృతదేహం వద్దే ప్రార్థనలు చేస్తూ ఉండిపోయారు.

Prayer for Mother : చనిపోయిన తల్లి బతకాలంటూ పిల్లల ప్రార్థనలు... 22 రోజులుగా మృతదేహం వద్దే...
Follow us on

చనిపోయిన తల్లి బతికి రావాలంటూ అభంశుభం తెలియని పిల్లలు ప్రార్థనలు చేశారు. ఒక్క రోజు… రెండు రోజులు కాదు… ఏకంగా 22 రోజులుగా తల్లి మృతదేహం వద్దే ప్రార్థనలు చేస్తూ ఉండిపోయారు. అయితే పోలీసులకు సమాచారం తెలియడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన తమిళనాడు దిండిగల్ జిల్లా నందవనవట్టి కాలనీలో చోటు చేసుకుంది. ఇందిరా అనే మహిళ కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్త నుంచి విడిపోయి… పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో ఇందిరా డిసెంబర్ 7న అనారోగ్యంతో మృతి చెందింది. ప్రార్థనలు చేస్తే ఇందిరా బతుకుతుందని పాస్టర్ సుదర్శన్ చెప్పడంతో పిల్లలు 22 రోజులుగా మృతదేహం వద్దే ప్రార్థనలు చేస్తు ఉండిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో మృతురాలి అక్క వాసుకితో పాటు పాస్టర్ సుదర్శన్ అరెస్ట్ చేశారు.

 

Also Read:

Doctor Suicide : విజయవాడలో కలకలం.. లేడీ డాక్టర్ ఆత్మహత్య..సూసైడ్ నోట్‌లో అతడి పేరు

గుంటూరు జిల్లాలో భారీ చోరీ, ఫ్యామిలీ గుడికి వెళ్లిన సమయంలో చాకచక్యంగా దోపిడీ, భారీగా బంగారు నగల అపహరణ