రియా చక్రవర్తిని ప్రశ్నించిన ముంబై పోలీసులు

|

Jun 18, 2020 | 2:37 PM

అయితే మిస్టరీగా మారిన సుశాంత్ ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మంది నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు....

రియా చక్రవర్తిని ప్రశ్నించిన ముంబై పోలీసులు
Follow us on

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సుశాంత్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో.. కేసును నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. అతడితో చాలా సన్నిహితంగా ఉండేవారిని ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా నటి రియా చక్రవర్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ జరిపారు. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇక రియా, సుశాంత్ ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారన్న ప్రచారమూ జరుగుతోంది. వారిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మిస్టరీగా మారిన సుశాంత్ ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మంది నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.

వీరిలో సుశాంత్ క్రియేటివ్ కంటెంట్ మేనేజర్, హౌస్ కీపర్ దీపేష్ సావంత్, వంటమనిషి, తాళం తయారు చేసిన వ్యక్తి వాంగ్మూలాలను ఇప్పటికే నమోదు చేశారు. ఆ తర్వాత సుశాంత్ తండ్రి కేకే సింగ్, ఇద్దరు సిస్టర్స్ నుంచి వాంగ్మూలాలను తీసుకున్నారు. వీరితోపాటు సుశాంత్ స్నేహితులు మహేశ్ శెట్టి, సిద్ధార్థ్ పితాని నుంచి కూడా విచారించి పలు విషయాలను తీసుకున్నారు.