Andhra Pradesh: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటనలో మైనర్లు..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం చేశారు ఐదుగురు దుండగులు.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో నిర్మాణంలో ఉన్న పేపర్ ఫ్యాక్టరీ దగ్గర వాచ్మెన్ కుటుంబం ఉంటోంది. ఉపాధి కోసం బళ్లారి నుంచి వచ్చింది ఈ కుటుంబం. అర్థరాత్రి రెండు బైకులపై వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో..
శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం చేశారు ఐదుగురు దుండగులు.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో నిర్మాణంలో ఉన్న పేపర్ ఫ్యాక్టరీ దగ్గర వాచ్మెన్ కుటుంబం ఉంటోంది. ఉపాధి కోసం బళ్లారి నుంచి వచ్చింది ఈ కుటుంబం. అర్థరాత్రి రెండు బైకులపై వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో.. ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు వాచ్మన్. ఈ సమయంలో వాచ్మెన్తో పాటు.. అడ్డుకోబోయిన అతని కొడుకును సైతం తీవ్రంగా కొట్టారు. కత్తులతో బెదిరించి ఇంట్లోని ఇద్దరు మహిళలపై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. బాధితుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. నిందితుల్లో మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు..
శ్రీసత్యసాయి జిల్లా అత్యాచార ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.. కాగా.. నిందితుల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుల్లో మైనర్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా.. పోలీసులు హిందూపురం త్యాగరాజ్కాలనీకి చెందిన నలుగురు అనుమానితులను అదుపులో కి తీసుకున్నారు.. వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. రేప్ కు పాల్పడిన నిందితులంతా చోరీలకు పాల్పడే ముఠాగా అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం చంద్రబాబు ఆరా..
కాగా.. గ్యాంగ్రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన సీఎం పలు కీలక సూచనలు చేశారు. అయితే.. అంతకుముందే.. జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పగలగొట్టిన సీసీ కెమెరాలు, కత్తిని స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో కండోమ్ ప్యాకెట్లు లభించడంతో… దుండగులు పక్కా ప్లాన్తోనే గ్యాంగ్ రేప్కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ రత్న తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..