7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి.. దారుణంగా హతమార్చిన దుండగులు

| Edited By:

Jul 02, 2020 | 5:22 PM

ఆడపిల్లలను రక్షించుకునేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కఠిన శిక్షలు విధించినా, ఉరి శిక్షలు సైతం వేసినా.. కామ రాక్షసుల ఆగడాలు ఆగడం లేదు. తమ వాంఛను తీర్చుకునేందుకు వయసు కూడా చూడకుండా ఆడపిల్లలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తమిళనాడులో రాక్షస ఘటన చోటుచేసుకుంది. పుదుకొట్టై జిల్లాలో ఓ ఏడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు దుండగులు. ముఖం నిండా గాట్లు పెట్టి తమలోని పైశాచికత్యాన్ని బయటపెట్టారు. అవుతైయార్కోవిల్‌లో ఆ చిన్నారి మృతదేహం బయటపడింది. దీనికి సంబంధించిన మరిన్ని […]

7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి.. దారుణంగా హతమార్చిన దుండగులు
Follow us on

ఆడపిల్లలను రక్షించుకునేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కఠిన శిక్షలు విధించినా, ఉరి శిక్షలు సైతం వేసినా.. కామ రాక్షసుల ఆగడాలు ఆగడం లేదు. తమ వాంఛను తీర్చుకునేందుకు వయసు కూడా చూడకుండా ఆడపిల్లలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తమిళనాడులో రాక్షస ఘటన చోటుచేసుకుంది. పుదుకొట్టై జిల్లాలో ఓ ఏడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు దుండగులు. ముఖం నిండా గాట్లు పెట్టి తమలోని పైశాచికత్యాన్ని బయటపెట్టారు. అవుతైయార్కోవిల్‌లో ఆ చిన్నారి మృతదేహం బయటపడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ విషయంపై తమిళనాడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ల చిన్నారిపై ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టిన వారికి ఉరి శిక్ష విధించాలని సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్‌లోనూ న్యాయం చేయాలంటూ బాధితురాలి పేరుతో ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు.

 

https://twitter.com/_piyush_jadhav_/status/1278601136983818240