బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా…నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రెండు ఆటోలను ఢీకొట్టింది. గయా జిల్లా బిష్ణుగంజ్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వీరంతా పక్కనే ఉన్న ఓ గ్రామంలో జరిగిన వేడుకలో పాల్గొని రెండు ఆటోల్లో తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. వేగంగా కరోనా విస్తరిస్తున్న ఈ సమయంలో వేడుకలకు ఎవరు అనుమతించారు… ముగ్గురు ప్రయాణించాల్సిన ఆటోలో ఆరుగురు ఎలా ప్రయాణించారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Bihar: Seven people killed & 12 others injured after a truck hit two autorickshaws they were travelling in near Vishunpur in Amas, Gaya earlier today. The injured people have been admitted to a hospital. pic.twitter.com/xCcyREvccI
— ANI (@ANI) June 15, 2020