కారులో పట్టుబడ్డ భారీ మొత్తంలో నగదు..నలుగురిపై కేసు

|

Jun 04, 2020 | 6:49 PM

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లా సిరొంచ ప్రాంతంలో వాహనాలు నిలిపేసిన పోలీసులు ఓ కారులో రూ.1.20 కోట్లు గుర్తించారు.

కారులో పట్టుబడ్డ భారీ మొత్తంలో నగదు..నలుగురిపై కేసు
Follow us on

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లా సిరొంచ ప్రాంతంలో వాహనాలు నిలిపేసిన పోలీసులు ఓ కారులో రూ.1.20 కోట్లు గుర్తించారు. మరో కారులో రూ.99.30 లక్షలు గుర్తించి..మొత్తం నగదును సీజ్‌ చేశారు. నగదుకు సంబంధించి ఎలాంటి ధ్రువ పత్రాలు చూపకపోవడంతో..నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని..యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాలను సీజ్‌ చేశారు. భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి తరలిస్తున్నారనే విషయంపై నలుగురిని విచారిస్తున్నట్లు సిరొంచ డీఎస్పీ ప్రశాంత్‌ స్వామి మీడియాకు వెల్లడించారు.