రౌడీషీటర్ దారుణహత్య.. తల మొండెం వేరుచేసిన దుండ‌గులు

|

Apr 24, 2020 | 11:47 AM

లాక్‌డౌన్ వేళ తెలంగాణ‌లో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. మొండెం నుంచి త‌ల‌ను వేరు చేసిన దుండ‌గులు అతి కిరాత‌కంగా చంపేశారు. వివ‌రాల్లోకి వెళితే… సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు గుర్తు తెలియని దుండగులు. తలను, కుడి చేతిని నరికి మొండెం నుంచి వేరు చేశారు. అది చూసిన స్థానికులు వెంట‌నే […]

రౌడీషీటర్ దారుణహత్య.. తల మొండెం వేరుచేసిన దుండ‌గులు
Follow us on
లాక్‌డౌన్ వేళ తెలంగాణ‌లో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. మొండెం నుంచి త‌ల‌ను వేరు చేసిన దుండ‌గులు అతి కిరాత‌కంగా చంపేశారు. వివ‌రాల్లోకి వెళితే…
సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు గుర్తు తెలియని దుండగులు. తలను, కుడి చేతిని నరికి మొండెం నుంచి వేరు చేశారు. అది చూసిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు సమాచారం అందించారు. ఈ మేరకు ఘ‌ట‌నాస్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు… మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హ‌త్య జ‌రిగిన పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతుడు సిద్దిపేట మండలం ఇమామ్‌బాద్‌కు చెందిన అంబటి ఎల్లంగౌడ్‌గా గుర్తించారు. ఎల్లంగౌడ్‌ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న‌ట్లు స‌మాచారం. అటు, ఎల్లంగౌడ్‌పై కర్ణాటక, మహారాష్ట్రలోనూ అనేక కేసులున్నట్లు తెలుస్తోంది. ఎల్లంగౌడ్‌ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట మండలం తడకపల్లికి చెందిన ఓ వ్యక్తి.. ఎల్లంగౌడ్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.