ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు..!

|

Jun 30, 2020 | 5:04 PM

దొంగతనం చేయడానికి ఏకంగా ఏటీఎంను ఎంచుకున్నారు. రోడ్డుపై కనిపించిన ఏటీఎం మిషన్ తో ఉడాయించారు. సిద్ధిపేట్ జిల్లాలోని రాజీవ్‌ రహదారిపై గల ప్రజ్ఞాపూర్‌ వద్ద జగదేవపూర్‌ వెళ్లే దారిలో ఉన్న ఇండియా వన్‌ ఏటీఎం చోరికి గురైందని పోలీసులు తెలిపారు.

ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు..!
Follow us on

కరోనాతో జనం అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చోరశిఖామణులకు అవకాశమే లేకుండాపోయిందేమో. అయితే, కన్నం వేసిన చేతులు ఖాళీ ఉంటాయా..? దొంగతనం చేయడానికి ఏకంగా ఏటీఎంను ఎంచుకున్నారు. రోడ్డుపై కనిపించిన ఏటీఎం మిషన్ తో ఉడాయించారు. సిద్ధిపేట్ జిల్లాలోని రాజీవ్‌ రహదారిపై గల ప్రజ్ఞాపూర్‌ వద్ద జగదేవపూర్‌ వెళ్లే దారిలో ఉన్న ఇండియా వన్‌ ఏటీఎం చోరికి గురైందని పోలీసులు తెలిపారు. ఏటీఎం నుంచి నగదును దొంగిలించేందుకు యత్నించిన దుండగులు, డబ్బులు రాకపోవడంతో గడ్డపారలతో దాన్ని పెకలించి ఎత్తుకెళ్లారు. తెల్లవారేసరికి ఏటీఎం మిషన్ కనిపించకపోవడంతో ఇంటి యాజమాని నిర్వాహకులకు సమాచారమిచ్చారు. దీంతో నిర్వహకులు గజ్వేల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎంలో ఉన్న రూ.4,98,800 నగదు ఉన్నట్లు నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.