తహశీల్దార్ విజయారెడ్డి కేసు: అటెండర్ చంద్రయ్య మృతి..!

| Edited By: Srinu

Dec 02, 2019 | 5:02 PM

తహశీల్దార్ విజయారెడ్డి.. సజీవ దహనం కేసులో.. ఆమెను కాపాడబోయిన అటెండర్ చంద్రయ్య మృతి చెందాడు. కొన్ని రోజులుగా.. డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రయ్య.. సోమవారం మరణించాడు. గత నెల రోజులుగా చంద్రయ్య ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తహశీల్దార్ విజయారెడ్డిపై లోగడ సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రెండు రోజుల తర్వాత సురేష్ కూడా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించాడు. కాగా.. మంటల్లో కాలిపోతోన్న విజయారెడ్డిని.. […]

తహశీల్దార్ విజయారెడ్డి కేసు: అటెండర్ చంద్రయ్య మృతి..!
Follow us on

తహశీల్దార్ విజయారెడ్డి.. సజీవ దహనం కేసులో.. ఆమెను కాపాడబోయిన అటెండర్ చంద్రయ్య మృతి చెందాడు. కొన్ని రోజులుగా.. డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రయ్య.. సోమవారం మరణించాడు. గత నెల రోజులుగా చంద్రయ్య ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తహశీల్దార్ విజయారెడ్డిపై లోగడ సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రెండు రోజుల తర్వాత సురేష్ కూడా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించాడు. కాగా.. మంటల్లో కాలిపోతోన్న విజయారెడ్డిని.. కాపాడే ప్రయత్నంలో.. డ్రైవర్, అటెండర్ చంద్రయ్య తీవ్రంగా శ్రమించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కాగా.. ఈ పెట్రోల్ దాడిలో.. డ్రైవర్ కూడా రెండు రోజుల తర్వాత చనిపోయాడు. అనంతరం ఇప్పుడు చంద్రయ్య మరణించాడు. దీంతో.. విజయారెడ్డి మృతుల సంఖ్య 4కి చేరింది. కాగా.. చంద్రయ్య మరణంతో.. ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.