Chennai Crime: చెన్నైలో ఓ తండ్రి కిరాతకం.. భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలను ఏం చేశాడంటే..

|

Feb 14, 2021 | 12:44 PM

Chennai Crime: భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో ముగ్గురు పిల్లలను వదిలించుకోవడానికి ఓ తండ్రి అత్యంత దారుణానికి

Chennai Crime: చెన్నైలో ఓ తండ్రి కిరాతకం.. భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలను ఏం చేశాడంటే..
Follow us on

Chennai Crime: భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో ముగ్గురు పిల్లలను వదిలించుకోవడానికి ఓ తండ్రి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ముగ్గురు పిల్లలను చంపేసి తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలోని కొరుక్కుపేట జీవానగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జీవానగరం ఆరవ వీధికి చెందిన వినోద్‌ ఎలక్ట్రీషియన్‌. ఇతడికి భార్య కవిత కుమారులు నవీన్‌, ప్రవీణ్‌ పిల్లలు. మూడు నెలల క్రితం దంపతుల మధ్య గొడవ పెరగడంతో గత నెల భార్య ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వినోద్‌కు ఇద్దరు పిల్లల పర్యవేక్షణ భారమైంది. ఈ పరిస్థితుల్లో శనివారం ఇంటి నుంచి వినోద్, పిల్లలు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు తలుపులు బద్దలు కొట్టిలోనికి వెళ్లారు. అక్కడ పిల్లలు మంచంపై మృతి చెంది ఉండడం, ఫ్యాన్‌కు వినోద్‌ వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపి, వినోద్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది.

కర్నూల్ జిల్లా ప్రమాదం : టెంపో- లారీ ఢీ కొన్న ఘటనలో 14 మంది స్పాట్ డెడ్.. డ్రైవర్‌ నిద్రమత్తే కారణమా?