పండ‌గ‌పూట విషాదం..ప్రేమ‌జంట సూసైడ్‌

| Edited By: Pardhasaradhi Peri

Mar 26, 2020 | 3:36 PM

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. పండ‌గ‌పూట ఓ ప్రేమ జంట బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. త‌మ ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించ‌ర‌నే భ‌యంతో..

పండ‌గ‌పూట విషాదం..ప్రేమ‌జంట సూసైడ్‌
Follow us on

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. పండ‌గ‌పూట ఓ ప్రేమ జంట బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. త‌మ ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించ‌ర‌నే భ‌యంతో చెట్టుకు ఉరివేసుకుని ప్రేమికులిద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. పూర్తి వివ‌రాలు ప‌రిశీలించ‌గా…

ఆసిఫాబాద్ కొత్త సార్సాల గ్రామానికి చెందిన యువ‌తి, బిబ్రా గ్రామానికి చెందిన దుర్గం సంతోష్‌లు ప్రేమించుకున్నారు. కొంత‌కాలం క‌లిసి తిరిగారు.పెళ్లి చేసుకోవాల‌ని ఆశ‌ప‌డ్డారు. అయితే, త‌మ ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించ‌ర‌ని భ‌య‌ప‌డ్డారు. మ‌న‌స్తాపంతో చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లం అంకుశాపూర్ అట‌వీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. అటుగా వ‌చ్చిన ప‌శువుల కాప‌రులు గ‌మ‌నించిపోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు మృత‌దేహాలను కింద‌కు దింపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు.