తాము తినే అన్నం ముట్టుకున్నాడని చితకబాదారు.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..

|

Dec 09, 2020 | 7:21 PM

ఆధునికంగా భారతదేశం ఎంత ముందుకు వెళుతున్నా కులం అనే వర్ణాన్ని మాత్రం విడనాడడం లేదు.

తాము తినే అన్నం ముట్టుకున్నాడని చితకబాదారు.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..
Follow us on

ఆధునికంగా భారతదేశం ఎంత ముందుకు వెళుతున్నా కులం అనే వర్ణాన్ని మాత్రం విడనాడడం లేదు. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒకచోట కుల హత్యలు, పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో తాము తినే ఆహారాన్ని ముట్టుకునేందుకు ఇద్దరు అగ్రవర్ణ వ్యక్తులు ఓ దళితుడిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించింది. వివరాల్లోకి వెళితే..

అగ్రవర్ణాలకు చెందిన భూర సోని, సంతోశ్‌ పాల్‌ అనే ఇద్ద‌రు వ్యక్తులు కిషన్‌పూర్‌ గ్రామంలో విందు నిర్వహించారు. విందు అనంతరం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయ‌డం కోసం దేవరాజ్ అనురాగి (25) అనే దళిత యువకుడిని ప‌నికి పిలిచారు. అయితే, ఆక‌లితో ఉన్న అనురాగి ముందుగా భోజనం చేసి, ఆ త‌ర్వాత ప‌ని మొద‌లుపెడుదామ‌ని అనుకొని ఆహారం వ‌డ్డించుకున్నాడు. అంతే అదే అతడు చేసిన పొరపాటుగా మారింది. అడ్డం వడ్డించుకున్న అనురాగిని చూసిన సోని, సంతోశ్‌లు ఒక్కసారిగా మండిపోయి అనురాగిపై పడి ముష్టిగాతాలతో విచక్షణ రహితంగా కొట్టారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో తిడుతూ కర్రలతో చచ్చే వరకు కొట్టారు. దెబ్బలు తాళలేక అనురాగి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని నిందితుల వేటలో ఉన్నారు. కాగా అన్యాయంగా చనిపోయిన అనురాగిని చూసి అతడి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.