Maoists killed in Police Encounter : ఛత్తీస్ఘడ్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కొండగావ్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. కొండగావ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసులకు మావోలు తారసపడ్డంతో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుంచి నాలుగు తుపాకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోలు ఎవరన్నది గుర్తించాల్సి ఉంది.