చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆస్ట్రేలియా నుంచి చెన్నైకి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర నుంచి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. 11.68 కిలోల నల్లమందుతో పాటుగా.. 5కిలోల కసుడో ఫెడ్రినో అనే మరోరకం డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో వీటి విలుల రెండున్నర కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తి వద్ద ఉన్న డ్రగ్స్ను సీజ్ చేసిన అధికారులు.. నిందితుడిపై NDPS చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా మూడు రోజుల వ్యవధిలో డ్రగ్స్ పట్టుబడటం ఇది రెండో సారి.