డాక్టర్‌పై మరణించిన కరోనా రోగి కుమారుడు కత్తి దాడి

| Edited By:

Jul 30, 2020 | 2:02 PM

కరోనా వేళ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తోన్న డాక్టర్లు ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు. అయితే వారి పట్ల కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తూ దాడి చేస్తున్నారు.

డాక్టర్‌పై మరణించిన కరోనా రోగి కుమారుడు కత్తి దాడి
Follow us on

Dead Covid-19 patient son stabbed doctor: కరోనా వేళ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తోన్న డాక్టర్లు ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు. అయితే వారి పట్ల కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తూ దాడి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే దేశ నలుమూలలా చాలానే జరిగాయి. తాజాగా మహారాష్ట్రలోని లాతూర్‌లో ఓ డాక్టర్‌పై మరణించిన కరోనా రోగి కుమారుడు కత్తితో దాడి చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కరోనా సోకిన ఓ వృద్ధ మహిళను కుటుంబ సభ్యులు లాతూర్‌లోని ఆల్ఫా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. వయసు రీత్యా ఆమెకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయినా చికిత్స అందించాలని రోగి బంధువులు అభ్యర్థించడంతో.. వైద్యులు చికిత్సను అందించారు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ మహిళ చనిపోయింది. దీంతో రోగి బంధువులు ఆసుపత్రిలో గొడవ చేయగా.. రోగి కుమారుడు ఓ డాక్టర్‌పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన ఛాతికి, గొంతుకు, చేతికి గాయాలు కాగా.. వెంటనే వేరే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్‌ కోలుకుంటున్నారు. కాగా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న మెడికల్ అసోసియేషన్‌.. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Read This Story Also: భారతీయులకు వికీపీడియా విఙ్ఞప్తి.. గతంలోనూ