డాక్టర్ ఆత్మహత్య.. ఆ నలుగురే కారణమంటూ లేఖ..!

| Edited By:

Feb 04, 2020 | 12:05 PM

హైదరాబాద్‌లో ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని వైష్ణవి ఆసుపత్రిలో మేనేజింగ్ డైరక్టర్‌గా పనిచేస్తోన్న అజయ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురు మానసికంగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అజయ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. అందులో యాంజల్‌కి చెందిన కొత్త కురుమ్మ శివ కుమార్, కరుణరెడ్డి హాస్పిటల్ బిల్డింగ్ ఓనర్ కొండల్ రెడ్డి, అతడి బావమరిది మెగా రెడ్డి, సరస్వతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అజయ్ […]

డాక్టర్ ఆత్మహత్య.. ఆ నలుగురే కారణమంటూ లేఖ..!
Follow us on

హైదరాబాద్‌లో ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని వైష్ణవి ఆసుపత్రిలో మేనేజింగ్ డైరక్టర్‌గా పనిచేస్తోన్న అజయ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురు మానసికంగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అజయ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. అందులో యాంజల్‌కి చెందిన కొత్త కురుమ్మ శివ కుమార్, కరుణరెడ్డి హాస్పిటల్ బిల్డింగ్ ఓనర్ కొండల్ రెడ్డి, అతడి బావమరిది మెగా రెడ్డి, సరస్వతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అజయ్ ఆ లేఖలో రాశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.