CI Suicide Attempt: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ సాయిరమణ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ కేయూసీ ఠాణా పరిధిలో బుధవారం సాయంత్రం 6 గంటలకు చోటు చేసుకుంది. కేయూసీ ఫిల్డర్ బెడ్ సమీపంలో తన కారులోనే సీఐ పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అదే దారి నుంచి వెళ్తున్న బ్లూకోల్ట్ పెట్రోలింగ్ సిబ్బంది గమనించారు. అదే సమయంలో సీఐ సాయిరమణకు ఫోన్ రావడంతో బ్లూకోల్ట్ సిబ్బంది ఫోన్ ఎత్తి మాట్లాడగా, ఆయన చిట్యాల సీఐ అని తేలడంతో హుటాహుటిన అతన్ని హన్మకొండ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలే కారణమని సూసైడ్ నోట్ రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై కేయూసీ ఠాణా సీఐ జనార్ధన్రెడ్డిని సంప్రదించగా, ఆయన ఈ ఘటనను ఆయన ధృవీకరించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Also Read: ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసులో.. నలుగురికి అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు