పట్టపగలే రెచ్చిపోయారు..

| Edited By:

Jul 14, 2019 | 10:12 AM

దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. నడిరోడ్డుపై ఓ మహిళను అంతా చూస్తుండగానే నిలువునా దోచేశారు. ఒడిస్సాలో భవానీపట్నం సమీపంలోని కలహండి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయమే వాకింగ్ కోసం వెళ్లిన వృద్ధురాలిని టార్గెట్ చేసిన దొంగల ముఠా ఆమెను తెలివిగా దోచుకునేందుకు ప్లాన్ చేశారు . ఒంటరిగా ఉన్న ఆమె వద్దకు వెళ్లి తాము పోలీసులమని చెప్పి ముందుగా నమ్మించారు. ఆపై .. ఇలా నగలు వేసుకుని బయట తిరగొద్దు అని చెప్పి తన నగలను […]

పట్టపగలే రెచ్చిపోయారు..
Follow us on

దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. నడిరోడ్డుపై ఓ మహిళను అంతా చూస్తుండగానే నిలువునా దోచేశారు. ఒడిస్సాలో భవానీపట్నం సమీపంలోని కలహండి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయమే వాకింగ్ కోసం వెళ్లిన వృద్ధురాలిని టార్గెట్ చేసిన దొంగల ముఠా ఆమెను తెలివిగా దోచుకునేందుకు ప్లాన్ చేశారు . ఒంటరిగా ఉన్న ఆమె వద్దకు వెళ్లి తాము పోలీసులమని చెప్పి ముందుగా నమ్మించారు. ఆపై .. ఇలా నగలు వేసుకుని బయట తిరగొద్దు అని చెప్పి తన నగలను తీయించి సంచిలో వేసి  తిరిగి ఆసంచిని ఆమె చేతికే  ఇచ్చేసి వెళ్లిపోయారు. తీరా ఇంటికొచ్చి చూసిన ఆమెకు ..జరిగిన మోసం అర్ధమై లబోదిబోమని గుండెలు బాదుకుని  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోగొట్టుకున్న నగల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని చెబుతోంది బాధిత మహిళ. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో  బైక్ నెంబర్ ఆధారంగా  దొంగలను గుర్తించే పనిలో పడ్డారు.