రెండు ముఠాలు… ఎనిమిది మంది దొంగలు!

|

Sep 28, 2020 | 5:07 PM

చైన్ స్నాచింగ్‌లకు పడుతున్న స్నాచింగ్ గ్యాంగ్ ల ఆట కట్టించారు పోలీసులు. రెండు గ్యాంగ్‌లకు చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

రెండు ముఠాలు... ఎనిమిది మంది దొంగలు!
Follow us on

విశాఖ లో పలు చైన్ స్నాచింగ్‌లకు పడుతున్న స్నాచింగ్ గ్యాంగ్ ల ఆట కట్టించారు పోలీసులు. రెండు గ్యాంగ్‌లకు చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌లపై విశాఖ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఒంటరి మహిళలు, వృద్ధులే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతూ, మెడళ్లలోని బంగారు గొలుసులు తెంపుకుని పారిపోయే కేటుగాళ్ల ఆటకట్టించారు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే రెండు గ్యాంగ్‌లకు చెందిన ఎనిమిది మందిని విశాఖ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నాచర్లలో ముగ్గురు బాల నేరస్థులుగా పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి 125 గ్రాముల బంగారు చైన్లు, 4 బైక్‌లను సీజ్ చేసినట్లుగా క్రైం డీసీపీ సురేష్ బాబు తెలిపారు. మహిళల మెడలో బంగారు గొలుసులను స్నాచ్ చేస్తున్న ముఠాలను అరెస్ట్ చేశామని.. వారితో పాటు ఇద్దరు రిసీవర్లనూ అరెస్ట్ చేశామని సురేష్ బాబు తెలిపారు. వీరంతా ఎప్పటికప్పుడూ బైకులను మారుస్తూ పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వివరించారు.