వివాదాస్పద ట్వీట్.. నాగబాబుపై కేసు నమోదు..!

| Edited By:

May 22, 2020 | 2:39 PM

మహాత్మా గాంధీని హతమార్చిన నాథూరం గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ మెగా బ్రదర్, జగసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

వివాదాస్పద ట్వీట్.. నాగబాబుపై కేసు నమోదు..!
Follow us on

మహాత్మా గాంధీని హతమార్చిన నాథూరం గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో కొందరు అతడికి మద్దతిచ్చినప్పటికీ., మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా గాంధేయవాదులు నాగబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో తన మాటలపై ఆయన వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం జాతిపితను కించపర్చడం కాదని స్పష్టత ఇచ్చినప్పటికీ.. అప్పటికే ఆయన రేపిన కాక ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్‌ బుధవారం నాగబాబుపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని హతమార్చిన గాడ్సేను ప్రశంసించి, నాగబాబు, గాంధీని అవమానించారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో అక్కడి పోలీసులు మెగా బ్రదర్‌పై కేసు నమోదు చేశారు. మరి ఈ వివాదంపై నాగబాబు ఎలా స్పందిస్తారు..? పోలీసులు, నాగబాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Read This Story Also: వలస కార్మికుల నడక కష్టాలు.. ముందుకొచ్చిన అల్లు అరవింద్..!