తెలంగాణలోని నారాయణ్ పేట్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య ప్రయాణిస్తోన్న బైక్ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుర్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు పరిస్థితి విషమంగా ఉండడంతో.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత నెల 27న శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద ఓ పశు వైద్యురాలు దారుణ హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపగా.. ఇందులో నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలానికి చెందిన అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును ప్రధాన నిందితులుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక డిసెంబరు 6న జరిగిన ఎన్కౌంటర్లో ఈ నలుగురు నిందితులు చనిపోయారు. అయితే ఈ ఎన్కౌంటర్పై కేసు నమోదు కావడంతో నిందితుల అంత్యక్రియల ప్రక్రియ ఆలస్యమైంది. ఎన్కౌంటర్ జరిగిన 17 రోజులు తర్వాత నిందితుల అంత్యక్రియలు డిసెంబర్ 23న ముగిసిన విషయం తెలిసిందే.