బెంగళూరు సిద్ధార్థ్ హత్యకేసులో నిందితుడు శ్యామ్ సుందర్ రెడ్డి ముళ్ళపొదల్లో ఉరివేసుకుని ఆత్మహత్య

|

Feb 02, 2021 | 3:21 AM

బెంగళూరుకు చెందిన సిద్ధార్థ్ హత్యకేసులో నిందితుడు శ్యామ్ సుందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి ప్రైవేట్ బస్ స్టాండ్ సమీపంలోని ముళ్ళపొదల్లో ఉరివేసుకుని శ్యామ్ సుందర్ రెడ్డి..

బెంగళూరు సిద్ధార్థ్ హత్యకేసులో నిందితుడు శ్యామ్ సుందర్ రెడ్డి  ముళ్ళపొదల్లో ఉరివేసుకుని ఆత్మహత్య
Follow us on

బెంగళూరుకు చెందిన సిద్ధార్థ్ హత్యకేసులో నిందితుడు శ్యామ్ సుందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి ప్రైవేట్ బస్ స్టాండ్ సమీపంలోని ముళ్ళపొదల్లో ఉరివేసుకుని శ్యామ్ సుందర్ రెడ్డి ప్రాణాలొదిలాడు. వినోద్ అనే స్నేహితుడితో కలిసి బెంగళూరుకు వెళ్లి సిద్ధార్థ్ ను హత్య చేసి నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారని శ్యామ్ సుందర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ హత్య కేసులో తాము బయటపడతామన్న భయంతోనే శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గత నెల 29 న శ్యామ్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. కాగా, వినోద్, శ్యామ్ ఇద్దరూ కొర్లగుంటకు చెందిన వారేనని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్  సీఐ శివప్రసాద్ రెడ్డి టీవీ9కు చెప్పారు.