దారుణం.. చదువుకుందామని రమ్మని.. టెన్త్ విద్యార్ధినిపై గ్యాంగ్‌ రేప్.. ఆ తర్వాత..!

| Edited By:

Mar 02, 2020 | 6:16 PM

చట్టాలు ఎన్ని ఉన్నా.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. చదువు కోవాల్సిన వయస్సులో సహచర విద్యార్ధినిపై కన్నేశారు ఆ దుర్మార్గులు. చదువుకుందాం రమ్మని పిలిచి.. ఆపై సామూహికంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. చెట్టుకు ఉరేసి హతమార్చారు. అస్సోంలో జరిగిన ఈ దారుణ ఘటన సభ్యసమాజాన్ని కలవరపెడుతోంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బిశ్వనాథ్ జిల్లా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… గోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్లా గ్రామంలో శుక్రవారం […]

దారుణం.. చదువుకుందామని రమ్మని.. టెన్త్ విద్యార్ధినిపై గ్యాంగ్‌ రేప్.. ఆ తర్వాత..!
Follow us on

చట్టాలు ఎన్ని ఉన్నా.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. చదువు కోవాల్సిన వయస్సులో సహచర విద్యార్ధినిపై కన్నేశారు ఆ దుర్మార్గులు. చదువుకుందాం రమ్మని పిలిచి.. ఆపై సామూహికంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. చెట్టుకు ఉరేసి హతమార్చారు. అస్సోంలో జరిగిన ఈ దారుణ ఘటన సభ్యసమాజాన్ని కలవరపెడుతోంది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బిశ్వనాథ్ జిల్లా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… గోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్లా గ్రామంలో శుక్రవారం నాడు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై అదే తరగతి చదువుతున్న ఆమె సహచరులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను చెట్టుకు ఉరేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పరీక్ష రాసిన అనంతరం పార్టీ చేసుకుందామంటూ సదరు బాలికను ఇతర విద్యార్థులు ఓ చోటికి పిలిచారు. అక్కడి నుంచి ఆ బాలికను ఓ ఇంటికి తీసుకెళ్లి.. రాత్రంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా.. సమీపంలోని అడవిలోని ఓ చెట్టుకు ఉరి వేశారు. శనివారం నాడు బాలిక మృతదేహాన్ని అడవిలో గుర్తించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనకు కారకులుగా భావించిన ఏడుగురు విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.