Extra Marital Affair: ఖమ్మం జిల్లాలో భార్యను హింసిస్తున్న భర్త.. ఎంబీబీఎస్ సీటును కోల్పోయిన కుమారుడు.. కారణం ఏంటో తెలుసా..

| Edited By: Pardhasaradhi Peri

Jan 05, 2021 | 4:20 PM

Extra Marital Affair: వివాహేత‌ర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నా కొంతమందికి బుద్ధి రావడం లేదు. తన ఆనందం కోసం కుటుంబ పరువును

Extra Marital Affair: ఖమ్మం జిల్లాలో భార్యను హింసిస్తున్న భర్త.. ఎంబీబీఎస్ సీటును కోల్పోయిన కుమారుడు.. కారణం ఏంటో తెలుసా..
affair
Follow us on

Extra Marital Affair: వివాహేత‌ర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నా కొంతమందికి బుద్ధి రావడం లేదు. తన ఆనందం కోసం కుటుంబ పరువును నడి రోడ్డు మీదకు లాగుతున్నారు. ఫలితంగా ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ వ్యక్తి మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తూ భార్య, కుమారుడిని హింసిస్తున్నాడు. కుమారుడి చ‌దువుకు పెట్టుబ‌డి పెట్టకుండా ఉన్న ఆస్తుల‌న్నింటినీ మ‌రో మ‌హిళ‌కు కట్టబెట్టాడు. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

బాధితుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని గట్టయ్య నగర్ సెంట‌ర్‌కు చెందిన రెడ్డి శ్రీనుకు, క‌విత‌తో 21 ఏళ్ల క్రితం వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు రెడ్డి ఉద‌య్ విశాల్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లైన త‌ర్వాత దంపతులిద్దరు కొంతకాలం అన్యోన్యంగానే ఉన్నారు. ఆ త‌ర్వాత శ్రీను వ్యాపారం పేరు మీద బ‌య‌ట తిరుగుతూ ఇత‌ర మ‌హిళ‌ల‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. గ‌త‌కొంత కాలం నుంచి ఖ‌మ్మంకు చెందిన మ‌రో మ‌హిళ‌తో అక్రమ సంబంధం నెరుపుతున్నాడు. విషయం భార్య కవితకు తెలియడంతో కుమారుడి సాయంతో రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. ఆస్తుల‌న్ని ఆమె పేరు మీద రాయించాడ‌ని, మమ్మల్ని తీవ్ర చిత్ర హింసలకు గురి చేస్తున్నాడ‌ని ఆవేద‌న వ్యక్తం చేసింది. కుమారుడిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అత‌ను ఎంబీబీఎస్ సీటును కోల్పోయాడు. ఈ ఏడాది రెడ్డి ఉద‌య్ విశాల్‌కు బీ కేట‌గిరి కింద ఎంబీబీఎస్ సీటు వ‌చ్చింది. అయితే స‌రైన స‌మ‌యానికి డ‌బ్బులు చెల్లించ‌క‌పోవ‌డంతో సీటు ర‌ద్దు అయిపోయింది. దీంతో భర్తతో పాటు ఆ మ‌హిళ‌ను పోలీసుల‌కు అప్పగించింది.

East Godavari Murder: తూర్పుగోదావరి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. స్పాట్‌కు అదనపు ఎస్పీ.. రంగంలోకి డాగ్ స్క్వాడ్‌