నగర శివారులో దారుణం.. పందుల దాడిలో బాలుడి మృతి

| Edited By:

Apr 22, 2020 | 4:14 PM

హైదరాబాద్‌ నగర శివారులో దారుణం చోటుచేసుకుంది. సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఓ మూడేళ్ల బాలుడిని పందులు పొట్టనబెట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా మైసిగండి వస్తాపురం తండాకు చెందిన.. వడిత్యా కేశ్యానాయక్‌, చిట్టి దంపతులు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం సింగరేణి కాలనీలో గుడిసెల్లో నివసిస్తూ బతుకుతున్నార. వీరికి ఓ మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అయితే మంగళవారం సాయంత్రం వీరి కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి ఇంట్లో ఉండి పనులు చేసుకుంటుండగా.. మూడేళ్ల బాలుడు గుడిసె […]

నగర శివారులో దారుణం.. పందుల దాడిలో బాలుడి మృతి
Follow us on

హైదరాబాద్‌ నగర శివారులో దారుణం చోటుచేసుకుంది. సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఓ మూడేళ్ల బాలుడిని పందులు పొట్టనబెట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా మైసిగండి వస్తాపురం తండాకు చెందిన.. వడిత్యా కేశ్యానాయక్‌, చిట్టి దంపతులు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం సింగరేణి కాలనీలో గుడిసెల్లో నివసిస్తూ బతుకుతున్నార. వీరికి ఓ మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అయితే మంగళవారం సాయంత్రం వీరి కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి ఇంట్లో ఉండి పనులు చేసుకుంటుండగా.. మూడేళ్ల బాలుడు గుడిసె బయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన పందుల గుంపు బాలుడిపై దాడికి దిగాయి. బాలుడిని నొటకరుచుకొని లాక్కెళ్లాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే వాటిని వెంబడించి తరిమికొట్టారు. అయితే అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.