విమాన ప్రయాణ రూల్స్ ఇక మరింత కఠినం !

| Edited By: Pardhasaradhi Peri

May 21, 2020 | 3:08 PM

కరోనా వైరస్ ఇంకా ‘బలంగానే’ ఉండడంతో.. విమాన ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ అథారిటీ మరిన్ని నిబంధనలను పాటించాలని సూచిస్తోంది. విమానంలో ఇక భోజన (ఫుడ్) సౌకర్యం ఉండదని, అలాగే వారు తమ సొంత ఫుడ్ తెచ్చుకోవడానికి కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రతి సీటు వద్ద మంచి నీళ్ల బాటిల్స్ మాత్రం ఉంటాయని వెల్లడించింది. టర్మినల్ బిల్డింగ్ లో ఎక్కడా న్యూస్ పేపర్లు గానీ, మ్యాగజైన్లు గానీ ఉండరాదని, వెబ్-చెక్ ను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. […]

విమాన ప్రయాణ రూల్స్ ఇక మరింత కఠినం !
Follow us on

కరోనా వైరస్ ఇంకా ‘బలంగానే’ ఉండడంతో.. విమాన ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ అథారిటీ మరిన్ని నిబంధనలను పాటించాలని సూచిస్తోంది. విమానంలో ఇక భోజన (ఫుడ్) సౌకర్యం ఉండదని, అలాగే వారు తమ సొంత ఫుడ్ తెచ్చుకోవడానికి కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రతి సీటు వద్ద మంచి నీళ్ల బాటిల్స్ మాత్రం ఉంటాయని వెల్లడించింది. టర్మినల్ బిల్డింగ్ లో ఎక్కడా న్యూస్ పేపర్లు గానీ, మ్యాగజైన్లు గానీ ఉండరాదని, వెబ్-చెక్ ను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. ఒక ప్రయాణికునికి ఒక చెక్ మాత్రమే అనుమతి ఉంటుంది. బ్యాగేజీ ట్యాగ్ ని ప్రింట్ చేసి లగేజీకి ఎటాచ్ చేయవలసి ఉంటుంది. ప్రయాణానికి గంట ముందు బ్యాగ్ ను డ్రాప్ చేయాల్సి ఉంటుంది.

ప్యాసింజర్ల బూట్లు, పాదరక్షలను డిస్ ఇన్ఫెక్ట్ చేయడానికి అనువుగా టర్మినల్ బిల్డింగ్ ఎంట్రెన్స్ లో మ్యాట్స్ లేదా కార్పెట్లను సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో తడిపి ఉంచాలి. ప్యాసింజర్లు భౌతిక దూరాన్ని పాటించేందుకు..ఖాళీగా ఉన్న సీట్లను మార్కర్స్ లేదా టేప్స్ తో అతికించవలసి ఉంటుంది. రద్దీని నివారించేందుకు ప్రత్యామ్నాయ చెక్-ఇన్ కౌంటర్లను వినియోగించుకోవాలి. ఎయిర్ పోర్ట్ స్టాఫ్ కి కిట్లు, హ్యాండ్ శానిటైజర్లు తప్పనిసరి. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు సాద్యమైనంత వరకు విమాన ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. రద్దీ నివారణకు టర్మినల్ ఎంట్రీ గేట్లన్నీ తెరచి ఉంచాలి..