సాధువుల హత్య.. 100 మంది అరెస్ట్.. అమిత్ షా కు ఉధ్దవ్ థాక్రే ఫోన్

| Edited By: Pardhasaradhi Peri

Apr 20, 2020 | 8:49 PM

మహారాష్ట్రలోని పాల్ఘార్ లో ముగ్గురు సాధువులను స్థానికులు కొట్టి చంపిన ఘటనపై సీఎం ఉధ్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తాను హోమ్ మంత్రి అమిత్ షాకు వివరించానని ఆయన తెలిపారు. సాధువుల లించింగ్ కి సంబంధించి 100 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆ ముగ్గురు దొంగలేమోనని పొరబాటు పడి స్థానికుల గుంపు వారిపై దాడి చేసిందన్నారు. అంతే తప్ప ఇది మతఘర్షణ కాదని ఆయన వివరించారు. ఈ ఘటనకు కారకులైనవారందరిపైనా కేసులు పెట్టడం […]

సాధువుల హత్య.. 100 మంది అరెస్ట్.. అమిత్ షా కు ఉధ్దవ్ థాక్రే ఫోన్
Follow us on

మహారాష్ట్రలోని పాల్ఘార్ లో ముగ్గురు సాధువులను స్థానికులు కొట్టి చంపిన ఘటనపై సీఎం ఉధ్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తాను హోమ్ మంత్రి అమిత్ షాకు వివరించానని ఆయన తెలిపారు. సాధువుల లించింగ్ కి సంబంధించి 100 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆ ముగ్గురు దొంగలేమోనని పొరబాటు పడి స్థానికుల గుంపు వారిపై దాడి చేసిందన్నారు. అంతే తప్ప ఇది మతఘర్షణ కాదని ఆయన వివరించారు. ఈ ఘటనకు కారకులైనవారందరిపైనా కేసులు పెట్టడం జరిగిందని ఉధ్ధవ్ థాక్రే వెల్లడించారు. ఈ ఘటనను మతానితో ముడి పెట్టడం సరికాదన్నారు.