85 ఏళ్ళ వయస్సులో కరోనాపై క్యాన్సర్ రోగి విజయం

| Edited By: Pardhasaradhi Peri

Jul 18, 2020 | 6:22 PM

ఒడిషాలో 85 ఏళ్ళ క్యాన్సర్ రోగి ఒకరు కరోనా వైరస్ పై విజయం సాధించాడు. ఈ వైరస్ బారిన పడిన అతని భార్య కూడా పూర్తిగా కోలుకుంది. సురేంద్ర పతి అనే ఈ వృధ్ధుడు గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. ఇతనికి కరోనా వైరస్ సోకగా.78 ఏళ్ళ . ఇతని భార్య..

85 ఏళ్ళ వయస్సులో కరోనాపై క్యాన్సర్ రోగి విజయం
Follow us on

ఒడిషాలో 85 ఏళ్ళ క్యాన్సర్ రోగి ఒకరు కరోనా వైరస్ పై విజయం సాధించాడు. ఈ వైరస్ బారిన పడిన అతని భార్య కూడా పూర్తిగా కోలుకుంది. సురేంద్ర పతి అనే ఈ వృధ్ధుడు గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. ఇతనికి కరోనా వైరస్ సోకగా.78 ఏళ్ళ . ఇతని భార్య సావిత్రి కూడా ఈ వైరస్ కి గురయింది. కటక్ లోని ఆచార్య హరిహర్ రీజనల్ క్యాన్సర్ ఆసుపత్రిలో జూన్ 8 న సురేంద్ర పతి చేరాడు. అప్పటి నుంచి ఇతనికి ఖీమోథెరపీ, ఇతర వైద్య చికిత్సలు చేస్తూ వచ్చారు డాక్టర్లు.. జూన్ 29 న ఇతని భార్య సైతం కరోనావైరస్ బారిన పడిందని, అయితే క్రమంగా భార్యాభర్తలిద్దరూ దీని నుంచి పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేశామని డాక్టర్లు  తెలిపారు. కరోనాపై విజయం సాధించిన వీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని వారు  పేర్కొన్నారు.