ఢిల్లీ.. జనరల్ వార్డుకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్.. మెరుగు పడిన హెల్త్

| Edited By: Pardhasaradhi Peri

Jun 22, 2020 | 7:24 PM

కరోనా వైరస్ కి గురైన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్  ఆరోగ్యం మెరుగుపడింది.  రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని ఐసీయూ నుంచి ఆయనను జనరల్ వార్డుకు తరలించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అలాగే ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్..

ఢిల్లీ.. జనరల్ వార్డుకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్.. మెరుగు పడిన హెల్త్
Follow us on

కరోనా వైరస్ కి గురైన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్  ఆరోగ్యం మెరుగుపడింది.  రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని ఐసీయూ నుంచి ఆయనను జనరల్ వార్డుకు తరలించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అలాగే ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ కూడా తొలగించారని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చాలావరకు తగ్గిందని ఈ వర్గాలు వివరించాయి. ఆయనకు ప్లాస్మా థెరపీని కూడా నిర్వహించారు. కాగా-దేశంలో సోమవారానికి కరోనా వైరస్ కేసులు 4.25 లక్షలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 14,821 కేసులు నమోదయ్యాయి. 174,387 యాక్టివ్ కేసులు కాగా.. 237,196 మంది కరోనా రోగులు కోలుకున్నారు. కరోనా రోగుల కోసం యాంటీవైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ మెడిసిన్ తయారీ, మార్కెటింగ్ కి హెటిరో, సీప్లా కంపెనీలకు డ్రగ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించింది.