ఢిల్లీలో సెకండ్ వేవ్ మొదలైందని నిపుణులు చెబుతున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నెలారంభంలో ఒక్క రోజే నాలుగున్నర వేల కేసులు నమోదయ్యాయని, అయితే గత 24 గంటల్లో3,700 కేసులు రిజిస్టరయ్యాయని ఆయన చెప్పారు. నగరంలో సెకండ్ వేవ్ కోవిడ్ మొదలైందని నిపుణులు పేర్కొంటున్నప్పటికీ ఈ తాజా ‘లెక్క’ ను వారు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో ఇవి మరింత తగ్గవచ్చునని ఆశిస్తున్నామన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. కరోనా వైరస్ టెస్టింగులను మళ్ళీ పెంచే యోచన ఉందన్నారు. ఈ టెస్టింగులను పెంచిన ఫలితంగానే కేసులు పెరిగాయని ఆయన ఆ మధ్య పేర్కొన్నారు.