మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. అంతేకాదు మరణాల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6817కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 18 మంది కరోనా బారినపడి ప్రాణాలు […]

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2020 | 8:20 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. అంతేకాదు మరణాల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6817కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 18 మంది కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి 800 మంది కోలుకున్నారని తెలిపారు. ఇక కరోనా బారినపడి మొత్తం 301 మంది ప్రాణాలు విడిచారు.