పెరుగుతున్న కరోనా.. ఒక్కరోజే 63 కేసులు

| Edited By: Pardhasaradhi Peri

Mar 21, 2020 | 11:49 AM

ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 63 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 230 కి పెరిగింది. నాలుగు డెత్ కేసులు నమోదయ్యాయి.

పెరుగుతున్న కరోనా.. ఒక్కరోజే 63 కేసులు
Follow us on

ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 64కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 271 కి పెరిగింది. నాలుగు డెత్ కేసులు నమోదయ్యాయి.శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటలవరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాలనీ రైల్వే శాఖ నిర్ణయించింది. అయితే ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాలకు సంబంధించి అత్యవసర ప్రయాణికుల కోసం సర్వీసులను రైల్వే శాఖ కనీస స్థాయికి తగ్గించింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు జనతా కర్ఫ్యూ ను పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కేంద్రం అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. ఇండిగో సంస్థ తన దేశీయ సర్వీసులను 60 శాతం మాత్రమే నడుపుతోంది .

సింగర్ కనికా కపూర్ నిర్వహించిన డిన్నర్ కోసం లక్నో వెళ్లిన బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా తన కుమారుడు దుశ్యంత్ సింగ్ తో సహా సెల్ఫ్ ఐసొలేషన్ పాటిస్తున్నారు. (కనికా కపూర్ కి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు ఇదివరకే వార్తలు వచ్చాయి.) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఈ పార్టీకి హాజరయినప్పటికీ ఆయన తన అపాయింట్ మెంట్లన్నీ రద్దు చేసుకున్నారు.