బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్ఛన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కరోనా వైరస్ బారిన పడడం తనను తీవ్రంగా కలచివేసిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. 1982 లో ‘కూలీ’ చిత్రం షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలంటూ.. తాను, తన తండ్రి, తల్లితో సహా తన కుటుంబమంతా ప్రార్థించిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అన్ని వయస్సులవారికీ మీరు స్ఫూర్తి అని, అంతా మిమ్మల్ని ప్రేమాభిమానాలతో ఆదరిస్తారని ఆయన ట్వీట్ చేశారు. మీ ప్రతిభే కాదు.. మీ ఫైటింగ్ స్పిరిట్, నిరాడంబరత, హుందాతనంతో మీరు అందరికీ ఆప్తులయ్యారని, అందరి ప్రేమాభిమానాలనూ చూరగొంటున్నారని పవన్ పేర్కొన్నారు. భగవాన్ ధన్వంతరి మిమ్మల్ని, మీ కుమారుడిని త్వరగా కోలుకునేలా చేస్తాడని, సంపూర్ణ ఆరోగ్య వంతులవుతారని ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు.
To my beloved & respected
Sri @SrBachchan ji, pic.twitter.com/fyMwsw3wQI— Pawan Kalyan (@PawanKalyan) July 12, 2020