Today Silver Rates In Hyderabad: సిల్వర్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నేడు కూడా రేస్ను కొనసాగించాయి. తాజాగా కేజీ వెండి ధర నిన్నటి ధరకు రూ. 900 పెరిగింది. దీంతో హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ. 71,500 లకు చేరింది. ప్రస్తుతం తులం వెండి రూ. 572గా నడుస్తోంది. కాగా, నిన్నటికి, ఇవాళ్టికి తులం వెండి ధర మధ్య వ్యత్యాసం రూ. 7.20. ఇక ఒక గ్రాము వెండి రూ.71.50 గా ఉంది. న్యూఢిల్లీ ఎంసీఎక్స్లో వెండి ధర రూ. 67,555 నడుస్తోంది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే.. వెండి ఔన్స్ 25.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రానున్న రోజుల్లో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వాణిజ్యరంగ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం నాడు కేజీ వెండి రూ.70,600 ఉన్నది.
Also read:
ముగ్గురు డకౌట్.. పేక మేడలా కూలిన భారత్ టాప్ ఆర్డర్.. తొలి టెస్ట్పై పట్టు బిగించిన ఆస్ట్రేలియా..