Silver Rates in India: పడిసి ధరలతో సిల్వర్ ధరలు పోటీ పడుతున్నాయి. వసరుగా పెరుగుదలతో కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తోంది. నేడు ఏకంగా కేజీ వెండిపై రూ.2,249 పెరిగింది. దాంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 69,477కు చేరింది. గత ట్రేడింగులో ఈ ధర రూ. 67,228గా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్ ధర 26. 63 డాలర్ల వద్ద ట్రేట్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలే సిల్వర్ ధరలు పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కాగా, డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ పడిపోవడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా వరుసగా పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.
Also read:
Strain Virus: హడలెత్తిస్తున్న కొత్తరకం వైరస్ స్ట్రెయిన్.. కర్ఫ్యూ దిశగా పలు రాష్ట్రాలు..