వస్తువుల సేవలపై ₹ 10,000 వరకు లావాదేవీల కోసం ప్రీపెయిడ్ చెల్లింపు పరికరం (పిపిఐ) ప్రవేశపెట్టాలని డిసెంబర్ 5 న రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో పిపిఐలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కొత్త పిపిఐని తీసుకురావడం.. వినియోగాన్ని మరింత సులభతరం చేస్తుందని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.
“పిపిఐ వాడకాన్ని మరింత సులభతరం చేయడానికి, కొత్త రకం పిపిఐని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించబడింది, ఇది ₹ 10,000 పరిమితి వరకు వస్తువులు, సేవల కొనుగోలుకు ఉపయోగించబడుతుంది” అని ఆ ప్రకటనలో తెలిపింది.
అటువంటి పిపిఐలను లోడ్ చేయడం, రీలోడ్ చేయడం బ్యాంక్ ఖాతా నుండి మాత్రమే చేయవచ్చని.. బిల్లు చెల్లింపులు చేయడానికి ఉపయోగించవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఇటువంటి పిపిఐలను కస్టమర్ యొక్క కనీస వివరాల ఆధారంగా జారీ చేయవచ్చు. దీనికి సంబంధించి 2019 డిసెంబర్ 31 లోగా సూచనలు ఇస్తామని ఆర్బిఐ తెలిపింది. పిపిఐలలో ఆర్థిక సేవలు, చెల్లింపుల సౌకర్యాలు కూడా ఉన్నాయి.