IRFC IPO : ఐపీఓలోకి తొలిసారి ప్రభుత్వ రంగ సంస్థ ఎంట్రీ .. ఒక్కో షేరు ధర రూ.25 ఉండే ఛాన్స్

|

Jan 17, 2021 | 9:14 PM

గతేడాది కాలంగా ఐపీఓలు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సోమవారం నుంచి ఐపీఓకు బిడ్లను స్వీకరించనుంది. ఇండియన్...

IRFC IPO : ఐపీఓలోకి  తొలిసారి ప్రభుత్వ రంగ సంస్థ ఎంట్రీ .. ఒక్కో షేరు ధర రూ.25 ఉండే ఛాన్స్
Follow us on

IRFC IPO : గతేడాది కాలంగా ఐపీఓలు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సోమవారం నుంచి ఐపీఓకు బిడ్లను స్వీకరించనుంది. ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (NBFC) ఈ నెల 18 నుంచి బిడ్ల స్వీకరణ మొదలుపెట్టనుంది. రూ.4,633 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చింది. దీనికి సంబంధించి సంస్థాగత మదుపర్లకు 15వ తేదీ నుంచే బుకింగ్స్‌  ప్రారంభంకానుంది.

ఒక్కో షేరు ధర రూ.25-రూ.26 మధ్య ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి యాంకర్‌ ఇన్వెస్టర్లకు 15వ తేదీ నుంచే బుకింగ్స్‌ షరూ కానున్నాయి . శుక్రవారం నాటికి రూ.1,398 కోట్లను సేకరించాలనే టార్గెట్‌‌గా ముందుకు కదులుతోంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఒక ఎన్‌బీఎఫ్‌సీ ఐపీఓకు రావడం ఇదే తొలిసారి.

ఈ ఆఫర్‌లో 50శాతం క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు. 15శాతం నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మిగిలిన 35శాతం వాటాలను రిటైల్‌ ఇన్వెస్టర్లకు విక్రయించనున్నారు.

ఇందులో పెట్టుబడులు పెట్టేవారు…

ఐఆర్‌ఎఫ్‌సీ(IRFC) వ్యాపారం విభిన్నంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రైల్వే మంత్రిత్వశాఖ కానీ నిబంధనలు మారిస్తే దీని లాభంపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి ఈ ఐపీఓ(IPO)లోని ప్రైస్‌బ్యాండ్‌ను చూస్తే కొనుగోలుదారులకు చౌకగానే వాటాలను అందజేస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు  భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఐపీఓకు వచ్చిన రైల్వే సంస్థలు మొత్తం లిస్టింగ్‌ సమయంలో లాభాలను అందించాయి. దీంతో ఐఆర్‌ఎఫ్‌సీ(IRFC)పై కూడా  ఇన్వెస్టర్లు ఆశలు పెట్టుకొన్నారు.