డ్రోన్‌లతో డోర్ డెలివరీ… ఇప్పుడు మనదేశంలో కూడా..!

| Edited By: Pardhasaradhi Peri

Jun 06, 2020 | 10:24 AM

ఇంటింటికీ డెలివరీ బాయ్స్ కాకుండా.. ఆకాశంలో ఎగురుతూ మన గుమ్మం వద్దకే కోరుకున్న ఫుడ్‌తో వాలిపోనున్నాయి డ్రోన్లు. ఇంతకాలం ఫుడ్‌ డెలివరీ చేస్తున్న జొమాటో, స్విగ్గీ, డుంజోతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దన్నుగా ఉన్న డ్రోన్‌ స్టార్టప్‌ ఆస్టీరియా ఏరోస్పేస్....

డ్రోన్‌లతో డోర్ డెలివరీ... ఇప్పుడు మనదేశంలో కూడా..!
Follow us on

విదేశాల్లో డ్రోన్‌లతో డోర్ డెలివరీ అని వినే వుంటాము. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంటింటికీ డెలివరీ బాయ్స్ కాకుండా.. ఆకాశంలో ఎగురుతూ మన గుమ్మం వద్దకే కోరుకున్న ఫుడ్‌తో వాలిపోనున్నాయి డ్రోన్లు. ఇంతకాలం ఫుడ్‌ డెలివరీ చేస్తున్న జొమాటో, స్విగ్గీ, డుంజోతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దన్నుగా ఉన్న డ్రోన్‌ స్టార్టప్‌ ఆస్టీరియా ఏరోస్పేస్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. డెలివరీ చేసేందుకు డ్రోన్లను ప్రయోగాత్మకంగా అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు భారత్‌ గతేడాదే ప్రకటించింది. ఇప్పటికే జొమాటో సంస్థ గతేడాదే డ్రోన్లను ఉపయోగించి డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.

అయితే సెప్టెంబర్‌ 30 నాటికి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన నిర్దిష్ట గగనతలంలో ఈ కన్సార్షియం కనీసం 100 గంటల పాటు ఫ్లైట్‌ టైమ్‌‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)కి నివేదికలు సమర్పించాలి… ఈ పరీక్షలు జూలై తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికంగా డ్రోన్‌ ఆధారిత సర్వీసులను అభివృద్ధి చేసుకునే దిశగా భారత్‌లో  తొలి అడుగులు పడనున్నాయి.

ఇలాంటి సేవలను ముందుగా మెట్రోపాలిటన్ నగరాల్లో వీటిని ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారు. అక్కడ సక్సెస్ అయితే వాటి సేవలను అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు.