పశ్చిమగోదావరిజిల్లా ప్రజలకు శుభవార్త

|

Sep 03, 2020 | 9:27 PM

పచ్చని పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. జిల్లాలో పిషరీస్ యూనివర్శీటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఎపి మంత్రివర్గం ఇవాళ నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

పశ్చిమగోదావరిజిల్లా ప్రజలకు శుభవార్త
Follow us on

పచ్చని పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. జిల్లాలో పిషరీస్ యూనివర్శీటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఎపి మంత్రివర్గం ఇవాళ నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎపిలో మత్స్య సంపద అధికంగా ఉందని.. ఆక్వా, ఫిషరీస్ రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారని వారికి ఉపయోగపడేలా పిషరీస్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం సంకల్పించింది. బాపట్ల దగ్గర ఒక మెడికల్ కాలేజ్, ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర మెడికల్ కాలేజీకి రాయవరం గ్రామంలో భూమిని కేటాయిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.